తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో అల్లు శిరీష్ అందరికి సుపరిచితమే, ఆయన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కి తమ్ముడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండవ వారసుడిగా అల్లు శిరీష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. శిరీష్ నటించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు మంచి విజయాన్ని అందుకోలేదనే చెప్పాలి మరి. ఇక దాదాపుగా తన సినిమాను విడుదల చేయక రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. అల్లు శిరీష్ నటించిన ABCD సినిమా తరువాత ఏ సినిమా విడుదల కాలేదు.

తాజాగా శిరీష్ నటిస్తున్న సినిమా సహజీవనం అనే కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు.. ఈ చిత్రంలో మాత్రం కథానాయికిగా అను ఇమ్మానియేల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. శిరీష్ ఈ సినిమా తప్ప వేరే సినిమాని ఏది ఒప్పుకోలేదు. తాజా సమాచారం ప్రకారం.. అల్లు శిరీష్ బాలీవుడ్ వైపు తన అడుగులు వేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాక.. ఆయన అప్పుడప్పుడు ముంబైకి వెళ్లి వస్తూనట్లు సమాచారం. ఇక అల్లు శిరీష్ కి తోడుగా తన తండ్రి అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ సినిమాల వైపు నిర్మాణ రంగంలోకి  అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఇది కేవలం అల్లుశిరీష్ బాలీవుడ్ లో నిర్మాణరంగం వైపా, హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే విషయం మాత్రం క్లారిటీ రాలేదు.

ఇక తే గత కొద్ది రోజుల నుంచి ఆహా ఓటీటీ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందట.. దీంతో వీడియో దారులు ఈ యాప్ తో చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని అల్లు శిరీష్ కు ఒక యూజర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సమస్యపై శిరీష్ స్పందించారు. ఆహతో తనకు సంబంధం లేదని… కేవలం కస్టమర్ కేర్ నే సంప్రదించండి అంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆహా ఆప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ, సాంకేతిక సలహాదారుగా వీరి అన్నయ్య బాబీ, తండ్రి అరవింద్ ఉన్నారని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: