మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి సంగీత దర్శకుడు తమన్ ఓ పోస్ట్ చేశాడు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ప్రతి హీరోకి కూడా ఎంతో ఆశగా ఉంటుంది. అలా ఈసారి మహేష్ బాబుతో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు రాగా అవి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి అని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మరొక సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా ఇన్ని రోజులకు వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కడం విశేషం. మొదటి నుంచి త్రివిక్రమ్ తన సినిమాలకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎక్కువగా ఎంచుకునే వాడు. కానీ మధ్యలో ఆయనకు తమన్ బాగా కనెక్ట్ కావడంతో ఆయనతోనే సినిమాలు చేస్తున్నాడు. ఆయనతోనే సంగీతం సమకూర్చుకుంటున్నాడు త్రివిక్రమ్. ఆ విధంగా వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ గా నిలవగా అలా వైకుంఠపురం లో చిత్రం వీరిద్దరికీ సంగీతం పరంగా మంచి పేరు ను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.

ఇక మహేష్ బాబు తో కూడా తమన్ కు మంచి మ్యూజిక్ రికార్డ్ ఉంది. తొలుత దూకుడు సినిమాకి తమన్ సంగీతం సమకూర్చి భారీ హిట్ ను సొంతం చేసుకుని ఆ తర్వాత సంగీత దర్శకుడు గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో నెంబర్ వన్ సంగీత దర్శకుడు గా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తనకి ఇష్టమైన డైరెక్టర్ తనకు పెద్ద సంగీత దర్శకుడుగా నిలబడే ఛాన్స్ ఇచ్చిన మహేష్ కు ఇద్దరికీ కలిపి తమన్ సంగీతం అందిస్తుండటం నిజంగా ఆయనకు ప్రెస్టేజ్ విషయం అనే చెప్పాలి. మరి ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: