ఒక వైపు పుష్ప మేనియా కొనసాగుతుండగా.. మరొక వైపు ఐకాన్స్టార్ అభిమానులకు మరొక ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు అల్లుఅర్జున్, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురంలో.. చిత్రాన్ని నార్త్ థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట. 2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్, పూజాహేగ్దే జంటగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లనే వసూలు చేసినది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రీమెక్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగానే.. అలా వైకుంఠపురంలో రీమెక్ హక్కులను మినహాయించి మొత్తం హిందీ హక్కులను గోల్డ్ మెన్స్ టెలిఫిల్మ్స్కు చెందిన మనీష్ షా కైవసం చేసుకున్నారు.
అయితే పుష్పరాజ్ హిందీ వెర్షన్ విడుదల చేసిన ఏఏ ఫిల్మ్స్, గోల్డ్మైన్ టెలిఫిల్మ్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాయి. అల వైకుంఠపురంలో డబ్బింగ్ వెర్షన్ను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసారు. ఈ చిత్రంలో టబు, జయారాం, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్, నవదీప్, సుశాంత్ కీలక పాత్రలను పోషించారు. ఇక చిత్రానికి అందించిన థమన్ మ్యూజిక్ అందరని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక బుట్టబొమ్మ సాంగ్ అయితే రికార్డునే సృష్టించినది.