ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ మీద క‌నిపిస్తూ ఉన్నాడు. ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన పుష్ప‌రాజ్ సినిమా డిసెంబ‌ర్ 17న విడుద‌లై క‌లెక్ష‌న్ల ప‌రంగా బాక్సాపీస్ వ‌ద్ద దూసుకుపోతూ రికార్డుల‌నే సృష్టిస్తోంది. పుష్ప విడుద‌లై నేటికి నెల రోజులు గ‌డిచినా.. పుష్ప క్రేజ్ మాత్రం అస్స‌లు త‌గ్గ‌లేదు.. కేవ‌లం ద‌క్షిణ భార‌త‌దేశంలోనే కాదు.. ఉత్త‌రాదిలో కూడా రూ.80కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి పుష్ప రికార్డుల వ‌ర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో అల్లుఅర్జున్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా అద్భుతంగా న‌టించి అంద‌రి మ‌న్న‌న‌లే పొందుతుంది.

ఒక వైపు పుష్ప మేనియా కొన‌సాగుతుండ‌గా.. మ‌రొక వైపు ఐకాన్‌స్టార్ అభిమానుల‌కు మ‌రొక ట్రీట్ ఇవ్వ‌డానికి మేక‌ర్స్‌ రెడీ అయ్యారు.  తాజాగా అందిన స‌మాచారం మేర‌కు అల్లుఅర్జున్‌, టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అల వైకుంఠ‌పురంలో.. చిత్రాన్ని నార్త్ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ సిద్ద‌మ‌వుతున్నార‌ట‌. 2020లో  త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్‌, పూజాహేగ్దే జంట‌గా న‌టించిన ఈ చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయింది. అయితే థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్ల‌నే వ‌సూలు చేసిన‌ది. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమాను హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ రీమెక్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండ‌గానే.. అలా వైకుంఠ‌పురంలో రీమెక్ హ‌క్కుల‌ను మిన‌హాయించి మొత్తం హిందీ హ‌క్కుల‌ను గోల్డ్ మెన్స్ టెలిఫిల్మ్స్‌కు చెందిన మ‌నీష్ షా  కైవ‌సం చేసుకున్నారు.

అయితే పుష్ప‌రాజ్ హిందీ వెర్ష‌న్ విడుద‌ల చేసిన ఏఏ ఫిల్మ్స్, గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నాయి. అల వైకుంఠ‌పురంలో డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ను జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసారు. ఈ చిత్రంలో ట‌బు, జ‌యారాం, రాహుల్ రామ‌కృష్ణ‌, నివేదా పేతురాజ్‌, న‌వ‌దీప్‌, సుశాంత్ కీల‌క పాత్ర‌లను పోషించారు. ఇక చిత్రానికి అందించిన థ‌మన్  మ్యూజిక్ అంద‌ర‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక బుట్ట‌బొమ్మ సాంగ్ అయితే రికార్డునే సృష్టించిన‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: