విఘ్నేష్ శివన్ లైఫ్లోకి నయనతార వచ్చాక ఈ దర్శకుడి ఫేట్ మారిపోయిందని చాలా మంది అనుకుంటుంటారు. 'నానుమ్ రౌడీథాన్' సినిమాతో విఘ్నేష్ శివన్ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా చేసింది. ఇక ఈ సినిమా హిట్ అయి విఘ్నేష్ని స్టార్ లీగ్లోకి వెళ్లాడు. అలాగే ఈమూవీతో నయన్ కూడా విఘ్నేష్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చింది.
నయనతారతో క్లోజ్ అయ్యాక విఘ్నేష్ శివన్ నిర్మాతగా కూడా మారాడు. రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేశాడు. కొంతమంది నయన్ డబ్బులతోనే విఘ్నేష్ నిర్మాణ సంస్థ మొదలుపెట్టాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు ఇద్దరు కలిసి చెన్నైలో ఒక ఇల్లు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. బిగ్షాట్స్ ఉండే పొయిస్ గార్డెన్లో ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారట.
నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ కలిసి ఇల్లు తీసుకోవడంతో, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. థర్డ్ వేవ్ తగ్గాక, నయన్, విఘ్నేష్ పెళ్లి పీటలెక్కుతారనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే అఫీషియల్గా పెళ్లి కాకపోయినా, నయనతార, విఘ్నేష్ శివన్ ఇద్దరూ సోల్ మేట్స్లాగే ఉంటున్నారు. పండగలు, హాలిడే ట్రిప్పులు అన్నీ కలిసే చేసుకుంటున్నారు.
మొత్తానికి నయనతార, విఘ్నేశ్ పెళ్లైన జంటలాగే బిహేవ్ చేస్తున్నారు. కనిపించిన వాళ్లకు కొత్త పెళ్లి జంటలా కనిపిస్తున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఈ జంట ఇల్లు కూడా తీసుకోవడం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.