తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాలయ్య బాబుకి కోపం ఎంత ఎక్కువ ఉందో.. అంతే ప్రేమ కూడా ఉంటుంది. బాలయ్య మాట కొద్దిగా ఘాటుగా అనిపించినా.. అతని మనసు మాత్రం చాలా మంచిదని ఎన్నో సందర్భాలలో రుజువు చేసుకున్నాడు.

ఇక బాలయ్యకి కోపం వస్తే.. ఎలా ఉంటుందో చాలా సార్లు చూశాము. ఇక బాలయ్య ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు అభిమానులు అతనితో సెల్ఫీల కోసం ఎగబడతారు. దీంతో వారిపై ఆయన చేయి చేసుకోవడం వంటి వార్తలు చూస్తూనే ఉంటాము. అంతేకాదు.. మరికొన్ని సందర్భాలలో బాలకృష్ణ మీడియాపై కూడా ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.

తాజా విషయం ఏంటంటే.. బాలయ్య రిపోర్టర్లను గాడిద అంటూ వారిపై చిందులు వేసిన సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటించాలని బాలకృష్ణ చెబుతున్న సమయంలోనే ఒక రిపోర్టర్ కలగజేసుకుని ‘సార్ వ్యక్తిగతంగా కాదు సామాజిక దూరం’ అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ.. ‘సామాజిక కాదు గాడిద.. వ్యక్తిగతం’ అంటూ సదరు రిపోర్టర్‌పై చిందులు వేశాడు. అంతేకాదు.. అసలు సామాజిక అంటే ఏమిటి అంటూ రిపోర్టర్‌పై పంచ్ వేశాడు బాలయ్య. అయితే బాలకృష్ణ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాక.. బాలయ్య మూడ్ చాలా బాగున్నట్టుంది అందుకే ఎంతో సున్నితంగా సమాధానం చెప్పుకొచ్చాడని అంటున్నారు. ఆ సమయంలో బాలయ్య కోపంగా ఉంటే దబిడి దిబిడే అయ్యేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: