తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ భార్య లెజినోవా రష్యాలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం అందరికి తెల్సిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పిక్స్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో పవన్ కళ్యాన్ తన భార్య అన్నా లెజినోవా సహా నలుగురు పిల్లలు కలిసి  ఉన్నారు. ఈ ఫోటో చూడటానికి చూడ ముచ్చటగా కనులకు విందుగా కనిపిస్తుందని పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు.. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లలతో నవ్వుతూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

అయితే మొదటి భార్య రేణూ దేశాయ్ కు పుట్టిన పిల్లల పేర్లు అకీరా నందన్, ఆద్యా అని అందరికి తెల్సిందే. వీరిద్దరూ విడిపోయాక పవన్ కళ్యాణ్, లెజినోవాని పెళ్లి చేసుకోగా వీరిద్దరికి పుట్టిన పాప పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కొణిదెలు అని తెల్సిందే. ఈ ఫోటో కొద్దిరోజుల క్రితం దిగినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. అకిరా నందన్ కు థర్డ్ వేవ్ లో కరోనా సోకింది. ప్రస్తుతం అకిరా నందన్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

ఇక ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాన్ తాజాగా వరస సినిమాలతో కూడా బిజీగా రాణిస్తున్నారు. అయితే పవన్ రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ భిమ్లా నాయక్ విడుదలకు సిద్ధం అవుతుండగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: