తాజాగా మెగాస్టార్ కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారు అంటూ వార్తలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో ఇదే అంశంపై దుమారం రేగుతోంది, ఇది నిజమా , కల్పితమా అన్న చర్చ నడుస్తోంది. తమ ప్రియతమ సెలబ్రిటీలు విడిపోకూడదని సంతోషంగా జీవించాలని ప్రేక్షక అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయానికి సంబంధించిన మరో న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి అల్లుడు కళ్యాణ్ దేవ్, కూతురు శ్రీజను పక్కన కూర్చో పెట్టుకుని మందలించారని, మనస్పర్ధలు అనేవి చాలా సహజం అని విడిపోవడం అనేది చాలా పెద్ద విషయం జీవితాన్నే తలకిందులు చేసే అంశమని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది.

ఇవన్నీ వద్దు సంతోషంగా కలిసి ఉండండి అంటూ అల్లుడు, కూతురిని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ఇకనైనా ఈ వార్త నిజం కాదని, ఇలాంటి కథనాలకు పుల్ స్టాప్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇండస్ట్రీలలో మాత్రం ఈ విడాకుల గోల వినిపిస్తూనే ఉంది. కర్మో లేక యాదృచ్ఛికమో తెలియడం లేదు కానీ  ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం కొనసాగుతోంది. ఏ ఇండస్ట్రీలో చూసినా టాప్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటిస్తూ ఉండడం సంప్రదాయంగా మారుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోను ఇదే పరిస్థితులను చూస్తున్నాం.

ఆ మధ్య  బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది తమ వ్యక్తిగత జీవితం అని అర్దం చేసుకోవాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఆ తరవాత టాలీవుడ్ స్టార్ కపుల్  నాగచైతన్య, సమంత మనస్పర్ధలు వచ్చాయని విడాకులు అంటూ విడిపోయారు. ఇది టాలీవుడ్ లో ఒక ఉప్పెనలా మారిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రెండు రోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తన భార్య ఐశ్వర్య ( రజినీకాంత్ కుమార్తె) విడిపోతున్నాం అంటూ ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా ధనుష్ మరియు రజిని కాంత్ అభిమానులు ఆందోళనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: