జక్కన్న రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే చాలు యావత్ సినిమా ప్రేక్షకులు అందరిలో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంటుంది. ఒక స్టార్ హీరో స్థాయిలో ఆ విధంగా ప్రేక్షకాభిమానుల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ దక్కించుకున్నారు రాజమౌళి. ఇక ఇటీవల ఆయన తీసిన బాహుబలి రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆయన తీసిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఈపాటికి విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనా పరిస్థితుల కారణంగా ప్రస్తుతం దాన్ని కొన్నాళ్లపాటు వాయిదా వేశారు. ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటించారు. అయితే విషయం ఏమిటంటే, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా రిలీజ్ విషయమై ఈసారి పక్కాగా ఒక డేట్ ని ఫిక్స్ చేసేలా ప్రస్తుతం రాజమౌళి ఎంతో తర్జనభర్జన పడుతున్నారని ఇన్నర్ వర్గాల న్యూస్.

మరోవైపు కరోనా కేసులు కొన్ని చోట్ల తగ్గుతూ మరికొన్ని చోట్ల పెరుగుతూ ఉండడంతో పక్కాగా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఆయనకి ఒకింత సవాల్ గా మారిందని, ఇక ఈసారి అనౌన్స్ చేసిన డేట్ ని ఎటువంటి మార్పులు లేకుండా చూసుకోవాలనేది ఆయన ఆలోచన అట. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం పక్కాగా తమ సినిమాని మార్చి 18 రిలీజ్ చేసేందుకు రాజమౌళి సుముఖత చూపుతున్నారని అంటున్నారు. అయితే అదే సమయానికి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండే మూవీ కూడా ఉండడంతో దాని నుండి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆ సినిమా నిర్మాతలతో కూడా రాజమౌళి సంప్రదించనున్నారని టాక్. మొత్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయమై ఎంతో డైలమాలో పడ్డ జక్కన్న ఈసారి ఫైనల్ గా ఎప్పుడు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: