మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలీవుడ్ హీరోలలో ముందుచూపుతో ఉండే హీరోల వరుసలో మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పవచ్చు. ఆయనకెఉ ముందు చూపు బాగా ఉంది కాబట్టే ఇప్పుడు ఇంతటి స్థాయి హీరో అవగలిగాడు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల సంస్కృతి మొదలు కాకముందే ఆయన అన్ని భాషలలో తన సినిమాను విడుదల అయ్యేలా చూసుకున్నాడు. అంతే కాదు బాలీవుడ్ లో ఏకంగా డైరెక్టుగా ఓ సినిమా చేసి అక్కడ దాన్ని విడుదల చేసి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అప్పటిదాకా ఆ ఆలోచన ఏ యంగ్ హీరోకి రాకపోవడం విశేషం. 

అయితే ఆ సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే రామ్ చరణ్ ఆలోచనలు మెచ్చుకోవాలి. ఒకవేళ అ జంజీర్ సినిమా కనుక హిట్ అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది అని చెప్పవచ్చు.  అయితే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాలని రాజమౌళి తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాను చేసిన రామ్ చరణ్ ఆ చిత్రం పోస్ట్ పోన్ కావడంతో ఆయనకు అది కొంత ఇబ్బందిగా మారింది అని చెప్పవచ్చు. దాంతో మరికొన్ని రోజులు ఆయన ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టడానికి సమయం ఏర్పడింది. అయితే ఈ గ్యాప్ ను ఫిల్ చేసుకునేందుకు రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ వేశాడని తెలుస్తుంది. 

ఇటీవలే పుష్ప సినిమాతో దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన క్రేజ్ ను తాను వాడుకునే విధంగా ప్లాన్ చేశాడు రామ్ చరణ్. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అందరి స్టార్ హీరోలతో పని చేసిన సుకుమార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసి చరణ్ కు అయన కెరీర్లోనే సూపర్ హిట్ చిత్రాన్ని అందజేశాడు. అలా సుకుమార్ తో కలసి ఆయన చేసిన రంగస్థలం సినిమా టాలీవుడ్ లో రికార్డులు మీద రికార్డులను తిరగరాయగా సూపర్ హిట్ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో డబ్ గా విడుదల చేసి తన సినిమా విడుదలకు ముందే అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అలా పుష్ప సినిమా లో నటించిన వారికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ చిత్రం ఉపయోగపడడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: