తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది కృతిశెట్టి. మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస సినీ అవకాశాలను అందుకుంది. ఆమె నటించిన రెండో సినిమా ‘శ్యామ్ సింగ్ రాయ్’ మంచి విజయాన్ని అందుకోగా.. అక్కినేని నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’ సినిమాలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు.

ఇక కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున - నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన సినిమా బంగార్రాజు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి నటించారు. ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు.. ఈ సినిమా భారీ వసూళ్లతో సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ తరుణంలోనే ఈ సినిమా 'బ్లాక్ బస్టర్ మీట్'ను రాజమండ్రిలోని 'మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్'లో నిర్వహించిన సంగతి అందరికి తెల్సిందే.

ఈ ఈవెంట్‌లో కృతిశెట్టి మాట్లాడుతూ.. 'బంగార్రాజు' పేరు వినగానే నాగార్జున - చైతూ గుర్తుకు వస్తారని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. నిజ జీవితంలోను వాళ్లిద్దరూ బంగారాలే అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు.. నాగ్ సార్‌ను చూడగానే చాలా రాయల్‌గా కనిపిస్తారని, ఇక చైతూ చాలా స్వీట్ హార్ట్ అని మాట్లాడింది. చైతూతో కలిసి నటించే అవకాశం లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అయితే ఈ సినిమాలో నేను మంచి సర్పంచ్‌ను కాబట్టి.. నా పాత్రకు లభిస్తున్న క్రెడిట్‌ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు ఇస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. కృతిశెట్టి ఆయన మామూలు మంచి దర్శకుడు కాదు .. చాలా మంచి దర్శకుడు అంటూ సినిమాలో తన డైలాగ్ తరహాలో చెప్పుకొచ్చింది. ఇక రాజమండ్రితో నాకు చాలా అనుబంధం ఉంది .. 'ఉప్పెన' సినిమా సమయంలో ఇక్కడ చాలా రోజులు ఉన్నానని మరోసారి గుర్తు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: