సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలనాటి శ్రీదేవి అందరికి సుపరిచితురాలు. ఇక దక్షిణాది భాషలతో పాటు తెలుగులో కూడా పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు అనే చెప్పాలి. శివకాశిలో జన్మించిన శ్రీదేవి చిన్న వయస్సులోనే నటిగా ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాల్లో నటించడం.. ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది.

ఇక శ్రీదేవి 1996 సంవత్సరం జూన్ 2వ తేదీన బోనీ కపూర్‌తో వివాహం చేసుకుంది. అంతేకాదు.. తమిళ, మలయాళ సినిమాలలో కూడా శ్రీదేవి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్ తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏం ఉందని అనుకుంటున్నారు..? ఆ ఫోటోలో శ్రీదేవి తన వీపుపై కుంకుమతో బోనీకపూర్ అనే అక్షరాలను రాయించుకుంది.

అయితే ఈ ఫోటో 2012 సంవత్సరంలో దిగిన ఫోటో అని బోనీ కపూర్ వెల్లడించారు. అది కూడా దుర్గా పూజ సంబరాల సమయంలో దిగిన ఫోటో అని బోనీ కపూర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. యూపీలోని లక్నోలో ఉన్న సహారా సహర్ ప్రాంతంలో దిగిన ఫోటో అని బోనీ కపూర్ తెలిపారు. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు శ్రీదేవి చాలా అందంగా ఉన్నారని, దేవకన్యను మళ్లీ చూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

అంతేకాదు.. కొందరు నెటిజన్లు శ్రీదేవి రూప్ కా రాణీ అని కామెంట్లు చేయగా.. మరి కొందరు నెటిజన్లు శ్రీదేవి మన మధ్య లేరనే నిజాన్ని ఇప్పటికీ అంగీకరించలేక పోతున్నామని కామెంట్ల రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు శ్రీదేవి వీపుపై బోనీ పేరును ఎవరు రాశారని ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి శ్రీదేవి ఏం చేసినా వెరైటీ అనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: