సూపర్ స్టార్ మహేష్ పూరీ జగన్నాథ్ హ్యాట్రిక్ కాంబో మూవీ గురించి సినీ లవర్స్ అంతా చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లో పోకిరి, బిజినెస్ మెన్ లాంటి రెండు మైల్ స్టోన్ మూవీస్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ తో జన గణ మన అనే మూవీని చేయాలని కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అయితే మధ్యలో పూరీ వరుస ఫ్లాపులు తీయడంతో మహేష్ పూరీతో సినిమా డేర్ చేయలేకపోయారు.

ఇదిలాఉంటే ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్. రీసెంట్ గా వచ్చిన లైగర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు అయ్యేలా చేసింది. పూరీ, విజయ్ డేరింగ్ కాంబో లైగర్ ని నెక్స్ట్ లెవల్ లో నిలబెట్టేలా చేస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ రాం తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. రాం కూడా ప్రస్తుతం లింగుసామితో చేస్తున్న ది వారియర్ తర్వాత పూరీతోనే కలిసి మూవీ చేస్తాడట.

ఇక ఈ సినిమా తర్వాత పూరీ మహేష్ జన గణ మన సినిమా ఉంటునట. మహేష్ సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రం సినిమా చేఏస్తున్నాడు. ఆ మూవీని కూడా త్వరగా పూర్తి చేసి పూరీతో తక్కువ రోజుల్లోనే ఆ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పూరీ, మహేష్ జన గణ మన మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తుంది. ఈ సినిమా వస్తే మాత్రం నేషనల్ లెవల్ లో మహేష్ స్టామినా ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. మహేష్ రాజమౌళితో కూడా ఓ భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: