అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది,  ఇలా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాలలో నటించి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది,  బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.

అందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తోంది, అందులో ఆరు బాలీవుడ్ సినిమాలే కావడం విశేషం.  ఛత్రీవాలీ మూవీలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసిందే, ఈ సినిమాతో పాటు  బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న 'రన్‌ వే-34', అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్ మల్హోత్రాలతో 'థ్యాంక్‌ గాడ్‌', ఆయుష్మాన్ ఖురానా సరసన 'డాక్టర్‌ జీ', అటాక్‌తో పాటు మరొక సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. తన సినిమాలు అందులో చేసే పాత్రల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను రకుల్ ప్రీత్ సింగ్ పంచుకుంది. నా కెరియర్ లో 2022 వ సంవత్సరం బాగుంటుందని ఆశిస్తున్నాను, నేను నటించిన ఏడు మూవీలు విడుదల కు రెడీగా ఉన్నాయి. వాటిలో ఆరు హిందీ సినిమాలే, ఆ మూవీస్  అన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాల్లో విభిన్న పాత్రలను పోషించారు. ఛత్రీవాలీ'లో కండోమ్‌ టెస్టర్‌ పాత్రను పోషించగా, 'రన్‌ వే-34'లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే 'అటాక్‌' సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కాగా, 'డాక్టర్‌ జీ'లో గైనకాలజిస్ట్‌ రోల్‌ చేస్తున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి, థియేటర్ లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడా విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: