టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన వ‌న్ నేనొక్క‌డినే సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయింది కృతిస‌న‌న్‌. ఆ త‌రువాత నాగ‌చైత‌న్య‌తో క‌లిసి దోచేయ్ చిత్రంలో సంద‌డి చేసిన‌ది. ఈ చిత్రాలలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. అయితే ఆ త‌రువాత బాలీవుడ్‌కు చెక్కెసింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్‌లో హిట్ సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపునే తెచ్చుకున్న‌ది. ఇటీవ‌ల మిమి సినిమాతో అంద‌రినీ మెప్పించింది ఈ అందాల తార‌.

మిమి సినిమాలో ఉన్న‌టువంటి ప‌రం సుంద‌రి పాట‌తో కుర్రాళ్ల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టింది. ప్ర‌స్తుతం రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఆదిపురుష్ సినిమాలో  కృతిస‌న‌న్ సీత‌గా న‌టిస్తున్న‌ది. దీనితో పాటు ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో కూడా బిజీగా ఉన్న‌ది. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కున్న కొన్ని ఏదు అనుభ‌వాల‌ను గుర్తుకు తెచ్చుకున్న‌ది. త‌న శ‌రీర సౌష్ట‌వం గురించి ఎదురు అయిన కామెంట్ల‌ను పంచుకున్న‌ది.

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎప్పుడూ న‌వ్వుతూ.. అందంగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ‌ను చూసి నువ్వు న‌వ్వితే అస‌లు బాగుండ‌వు అని విమ‌ర్శించార‌ట‌. అంతేకాదు.. ఆమె పెదాల ఆకృతి మార్చుకోవాల‌ని స‌ల‌హా కూడా ఇచ్చార‌ట‌. మ‌రికొంద‌రూ అయితే ఆమె ముక్కు బాగాలేద‌ని.. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకోమ‌న్నార‌ట‌. ఆమె న‌వ్విన‌ప్పుడు నాసిక రంద్రాలు ఎర్ర‌బ‌డ‌తాయ‌ని తగ్గించుకోవాల‌ని సూచించార‌ని చెప్పింది. అయితే నేనే ప్లాస్టిక్ బొమ్మ‌ను కాదు క‌దా.. అంటూ వారి మాట‌ల‌ను అస్సలు ప‌ట్టించుకోలేదు అని వివ‌రించింది.

నాకు నాలాగా ఉండ‌టం మాత్ర‌మే ఇష్టం. మిగ‌తా వారికి కూడా ఇదే స‌ల‌హా చెబుతాను. ఎవ‌రెవ‌రో వ‌చ్చి ఏదేదో చెబితే అవ‌న్నీ మ‌నం అస‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మ‌న‌కు న‌చ్చిన‌ట్టుగా మ‌నం ఉండాలంటూ త‌న‌లా బాడీ షేమింగ్‌కు గురైన వారిలో స్పూర్తిని నిపింది కృతి స‌న‌న్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆదిపురుష్‌తో పాటు బ‌చ్చ‌న్ పాండే, షెహ‌జాద‌, బేడియా, గ‌ణ్‌ప‌త్ వంటి చిత్రాల‌లో న‌టిస్తూ చాలా బిజీగా గ‌డుపుతోంద ఈ అందాల తార‌.


మరింత సమాచారం తెలుసుకోండి: