సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత గీత గోవిందం ఫెమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి. ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరి నుండి తప్పించి, ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

 ఇది ఇలా ఉంటే మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే, ఇక ఈ మూవీలో బాలీవుడ్ హీరో కం విలన్ సునీల్ శెట్టి ని తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునీల్ శెట్టి తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు అనే సినిమాలో కనిపించాడు.  ఇది ఇలా ఉంటే ఈ సమ్మర్ లో మహేష్ బాబు తో, త్రివిక్రమ్  సినిమాను మొదలు పెట్టి 2023 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: