యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు, అయితే ఆ మార్కెట్ ను అలాగే కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో అంతకుమించిన సినిమాలో నటిస్తు వస్తున్నాడు,  అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం రాదే శ్యామ్ సినిమాను పూర్తి చేశాడు, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతంగా పెరుగుతున్న కారణంగా ఈ సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల వేయకుండా వాయిదా వేశారు.

ఇప్పటికీ ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించలేదు.  ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు సలార్, సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ ను ప్రభాస్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు,   అలాగే ఆది పురుష్ సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు, ప్రభాస్ ఈ సినిమాలో రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను కూడా దాదాపుగా ప్రభాస్ పూర్తి చేశాడు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ , నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే సినిమా లో నటిస్తున్నాడు.  అయితే ఈ అన్ని సినిమాలలో రాధే శ్యామ్ సినిమా ఒక్కటే పూర్తిగా పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది, మిగతా అన్ని సినిమాలు కూడా ఎంతో కొంతమేర బ్యాలెన్స్ పడిపోయాయి. ఈ అన్ని సినిమాలు విడుదల కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయితే ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్  మూవీలో నటించబోతున్నట్లు కూడా  అనౌన్స్ చేశాడు,  కానీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించడానికి ఇంకా చాలా సమయం  పట్టే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: