టాలీవుడ్ కి తొలిసారిగా భద్ర సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టి సూపర్ హిట్ కొట్టారు మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను. రవితేజ హీరోగా తెరకెక్కిన భద్ర మూవీని దిల్ రాజు నిర్మించగా మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తరువాత బాలయ్యతో సింహా, లెజెండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన బోయపాటి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు వంటి సూపర్ హిట్ కొట్టి దర్శకుడిగా ఎంతో గొప్ప క్రేజ్ అందుకున్నారు. అయితే మధ్యలో బోయపాటి ఎన్టీఆర్ తో తీసిన దమ్ము, రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సినిమాలు ఫ్లాప్ కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో తీసిన జయ జానకి నాయక మూవీ మాత్రం యావరేజ్ గా నిలిచింది.
ఇక లేటెస్ట్ గా బాలయ్యతో ముచ్చటగా మూడోసారి బోయపాటి తీసిన అఖండ మూవీ కూడా మంచి సక్సెస్ కొట్టడంతో అందరిలో ఆయన నెక్స్ట్ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఇక అసలు విషయంలోకి వెళితే త్వరలో బోయపాటి ఒక భారీ వెంచర్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి ఏకంగా బాలయ్య, అల్లు అర్జున్ లతో బోయపాటి భారీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తీయనున్నారని, దానికి సంబంధించి ప్రస్తుతం కథ, స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న బోయపాటి దానిని పక్కాగా ఏప్రిల్ లో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని సమాచారం.

ఈ సినిమాలో అటు బాలయ్య పాత్ర, ఇటు అల్లు అర్జున్ పాత్ర రెండూ కూడా ఎంతో అదిరిపోయేలా బోయపాటి ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వినికిడి. మరోవైపు ఇటీవల అఖండ సక్సెస్ మీట్ లో భామగా బోయపాటి మాట్లాడుతూ నా తదుపరి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు, వెయిట్ చేయండి ఈసారి ఏదైనా జరగొచ్చు అంటూ చెప్పుకొచ్చారు. కాగా ఆ మాటలోని అంతరార్ధం ఇదన్నమాట, ఒకవేళ బోయపాటి అల్లుల్ అర్జున్, బాలయ్య తో సిద్ధం చేస్తున్న స్క్రిప్ట్ కనుక వర్కౌట్ అయి రేపు తెరకెక్కిన తరువాత పెద్ద సక్సెస్ కొడితే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రచ్చే రచ్చే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: