ఇండస్ట్రీకి కొంత విరామం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటిస్తున్నా విషయం అందరికే తెల్సిందే. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు.. ఈ సినిమా తరువాత  ఒకటిగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఆ సినిమాలో వెంకీతో కూడా ఓ సినిమాకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది.ఈ మూవీకి వెంకీ భారీగా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరు పాత్రను నెవ్వర్ బిఫోర్‌ అనేలా రెడీ చేశాడని, ఈ పాత్ర చాలా హిలేరియస్‌గా రాశారని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో చిరు కామెడీ దెబ్బకు ప్రేక్షకులకు ఊపిరాడదని, పక్కా టైమింగ్‌తో కామెడీ డైలాగ్స్ రాశాడని వార్తలు వినపడుతున్నాయి.

ఈ చిత్రంలో ప్రతి సీన్‌కూడా అంతకు మించి అనేలా ఉంటుందని.. ఇక వెంకీ రాసిన కామెడీ రోల్‌ చిరుకు కూడా భలే నచ్చిందని, ఆ రోల్‌లో ఎటువంటి మార్పులు చేయొద్దని చిరు అన్నాడని టాక్ నడుస్తుంది. ఈ మూవీ మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్‌ ఇవ్వడం పక్కా అని, ఈ సమ్మర్‌కి సినిమా పట్టాలేక్కుతుందని సమాచారం. కాగా.. ప్రస్తుతం వెంకీ కథలో చిరు రోల్‌ని మరింతగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాత్రకి పవర్ సీన్స్, డైలాగ్స్‌ను కూడా జోడిస్తున్నాడని గుసగుసలు వినపడుతున్నాయి. ఈ చిత్రంతో మెగా అభిమానులను ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి మరి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం టీం హీరోయిన్‌లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో కొన్ని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్‌ను కూడా బరిలోకి దించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: