సినిమా పరిశ్రమ అంటేనే గ్లామర్ పరిశ్రమ. సినిమాల్లో హీరోయిన్ లు గ్లామర్ పంచుతూ ప్రేక్షకులను ఆకర్షించాలి. హీరోలు సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ లు అంటూ తమ దేహాన్ని చూపిస్తూ అందరినీ కనువిందు చేయాలి. అలా హీరో హీరోయిన్ లుగా నటించే వారికి ఈ రకమైన ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడ తమ అందచందాలు ప్రేక్షకులు నచ్చరేమో నన్న భయం హీరోయిన్ లకి ఉంటే, ఎక్కడ తమ ఫిజిక్ బాగా లేదని విమర్శలు చేస్తారన్న భయం హీరోలలో ఉంటుంది. ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్ లు తమ అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో వారు తమ అందాల ప్రదర్శన చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రమే కాదు దర్శక నిర్మాతను కూడా ఆకట్టుకుంటూ మంచి మంచి సినిమా అవకాశాలను పొందుతున్నారు. అలా టాలీవుడ్ లో ఇప్పుడు గ్లామర్ చేసే హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది పూజా హెగ్డే. నెంబర్ వన్ హీరోయిన్ గా ఉంది అంటేనే ఆమె ఏ స్థాయిలో గ్లామర్ ను ప్రేక్షకులకు చూపిస్తూ వారిని కనువిందు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రష్మిక మందన కూడా ప్రేక్షకులకు హద్దులు దాటి తన అందాలను చూపిస్తోంది అని చెప్పాలి.

ఇక వీరిద్దరి తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న రాశీ కన్నా మోతాదుకు మించి అందాలను చూపిస్తూ సినిమా అవకాశాలను పొందే ప్రయత్నం చేస్తుంది. ఇక మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే గ్లామర్ షో చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సాంప్రదాయబద్ధమైన పాత్రలు చేసిన ఈమె ఇకపై గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధం అయ్యింది. ఇక యువ హీరోయిన్ లు కృతి శెట్టి మరియు శ్రీ లీల లు కూడా గ్లామర్ తో మాయ చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాదు ఇంకొంతమంది హీరోయిన్లు కూడా సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవడానికి దేనికైనా సై అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: