అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన 'బంగార్రాజు' చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా రూపొందింది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. మొదటి వారం పూర్తయ్యే లోపే సుమారు 90 శాతం రికవరీ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో వీకెండ్ అలాగే రిపబ్లిక్ డే కూడా ఉండడంతో బంగార్రాజు కి ఇవి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

అయితే రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉన్న బంగార్రాజు సినిమాకి కత్తెర పడనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ పాటను డిలీట్ చేయడానికి చిత్ర బృందం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగార్రాజు సినిమాలో స్వర్గంలో నాగార్జున, రమ్యకృష్ణ లు ఉన్నప్పుడు వారి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. 'నువ్వు సిగ్గు పడితే'.. అంటూ సాగే ఈ పాట వినడానికి బాగున్నా.. పాటలో నాగార్జున, రమ్యకృష్ణ ల వయస్సు మీద పడినట్లు కనిపిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. పైగా సినిమాలో ఈ పాట బోర్ కొట్టించే విధంగా ఉందని కొందరు ఈ పాట పై పెదవి విరిచారు. దాంతో ఈ పాటను తొలగించడానికి చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

జనవరి 21 నుండి థియేటర్స్ లో బహుశా ఈ పాట ఉండకపోవచ్చని టాక్ నడుస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా నిడివి రెండు గంటల 40 నిమిషాలు కాగా.. ఈ పాటతో పాటు సినిమాలో మరేమైనా సన్నివేశాలు తొలగిస్తారేమో చూడాలి. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో విడుదలైన మూడు రోజుల్లోనే యాభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: