నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించిన హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్. అంతకుముందు మోడల్ గా చేస్తూ కన్నడ సినిమా రన్ ఆంటోని సినిమాతో తెరంగేట్రం చేసిన రుక్సర్ ధిల్లన్ తెలుగులో మాత్రం ఆకతాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత నాని మేర్ల పాక గాంధి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో అమ్మడు నటించింద్ది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే అమ్మడికి వెంట వెంటనే ఛాన్సులు రాలేదు. నాని సినిమా తర్వాత అల్లు శిరీష్ తో ఏబిసిడి సినిమాలో నటించింది రుక్సర్.

ఈ సినిమాకి కూడా అమ్మడి బ్యాక్ లక్ వెంటాడటంతో ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. అందుకే రుక్సర్ కి మళ్లీ అవకాశాలు రాకుండా పోయాయి. అందం అభినయం ఉన్న అమ్మడికి టాలీవుడ్ లో అనుకున్నంత విధంగా అవకాశాలు రాలేదని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఛాన్స్ అందుకుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమ్మడు తను ఒకప్పుడు రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు తనకు ఎలాంటి వాడు భర్తగా కావాలో అతని క్వాలిటీస్ ఎలా ఉండాలో కూడా చెప్పింది రుక్సర్. అందరు చెప్పినట్టుగానే తనకు నిజాయితీగా ఉండాలని అతని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని. ప్రేమ పెళ్లి మీద ఆసక్తి ఉందని. ఇదివరకు రిలేషన్ షిప్ లో ఉన్నా ఇప్పుడు సింగిల్ గానే ఉన్నానని చెప్పింది రుక్సర్. ప్రస్తుతం కెరియర్ మీదే ఫుల్ ఫోకస్ అంటున్న రుక్సర్ పెళ్లంటూ చేసుకుంటే అతను ఇలా ఉండాలని కొన్ని కండీషన్స్ పెడుతుంది. మరి అమ్మడు మనసుకి నచ్చిన వాడు తారసపడతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: