పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆ తర్వాత మళ్లీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.  అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా కనిపించబోతున్నాడు, ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందిస్తున్నాడు, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

  ఇప్పటికే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది,  కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను జనవరి 12 వ తేదీన కాకుండా ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, సినిమా షూటింగ్ ను కూడా కొంత భాగం పూర్తి చేశాడు,  అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడు, అయితే ఈ రెండు సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, దానికి ప్రధాన కారణం ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో  రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకొని పరిస్థితులు అన్నీ చక్కబడ్డాక తిరిగి సినిమా షూటింగ్ లను ప్రారంభించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: