టాలీవుడ్ ప్రేక్షకులకు గోపీచంద్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ హీరో తొలి వలపు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సాధించడంతో ఆ తరువాత వెంటనే గోపీచంద్ కు తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమాలో విలన్ పాత్ర దక్కింది. ఇలా జయం సినిమాలో విలన్ గా అదిరిపోయే పర్ఫామెన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరోకు వరుసగా వర్షం, నిజం సినిమాల్లో కూడా విలన్ పాత్రలు దక్కాయి. ఈ సినిమాలతో  గోపీచంద్ టాలీవుడ్ లో మోస్ట్ పవర్ఫుల్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు,  అయితే అలా విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత మళ్ళీ యజ్ఞం సినిమాతో హీరోగా మారి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నడు.

 ఆ తర్వాత గోపీచంద్ హీరోగా అనేక విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.  ఇది ఇలా ఉంటే  మరొకసారి గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ఒక వార్తా సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది,  అసలు విషయంలోకి వెళితే..  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి,  అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇది ఇలా ఉంటే మరి కొంత మంది మాత్రం ప్రస్తుతం స్టార్ హీరో స్టేటస్ ను పొంది ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గోపిచంద్ విలన్ పాత్ర చేస్తాడా అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: