పాన్ ఇండియా స్టార్ కాదు కాదు పాన్ వరల్డ్ స్టార్ గా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తను నటించిన రాధే శ్యాం రిలీజ్ కు రెడీగా ఉండగా మరోపక్క ఓం రౌత్ ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలు క్రేజీగా సెట్స్ మీద ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ తన నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె కూడా లైన్ లో పెట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో ప్రశాంత్ నీల్ తోనే మరో సినిమా ఉంటుందని టాక్. ఇదిలాఉంటే ప్రభాస్ మరో కొత్త సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తుంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ లో మారుతి ఒకరు. ఈరోజుల్లో లాంటి లో బడ్జెట్ సినిమాతో కెరియర్ ప్రారంభించి ఇప్పుడు మీడియం బడ్జెట్ లో మినిమం గ్యారెంటీ హిట్ అనే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. ప్రభాస్ ఈ సినిమాను కేవలం తెలుగు ఆడియెన్స్ కోసమే తీసే ఆలోచనలో ఉన్నారట. డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తారని తెలుస్తుంది.

ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా పాన్ ఇండియానే మరి మారుతి సినిమా పాన్ ఇండియా కాదా అంటే వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ చేంజ్ ఓవర్ కోసం కేవలం తెలుగు ఆడియెన్స్ కోసమే ఓ మాములు బడ్జెట్ తో సినిమా అనుకుంటున్నారట. మారుతి ఇప్పటికే సినిమా కథ రెడీ చేయగా ప్రభాస్ కి వన్ లైన్ ఆర్డర్ పంపిస్తే మెచ్చాడని తెలుస్తుంది. ఇక ఫుల్ వర్షన్ ఫైనల్ డిస్కషన్ కంప్లీట్ అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు గ్యాప్ ఇచి ప్రభాస్ మారుతి సినిమాని మెయిన్ స్ట్రీం లోకి తీసుకురావలని చూస్తున్నాడు. మరి మారుతి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: