శ్రీవల్లి అలియాస్ రష్మిక మందన్న.. ఈమె ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా అయితే మంచి గుర్తింపు వచ్చింది..కానీ తన పాత్ర వల్ల ఈమెకు గుర్తింపు రాలేదనే చెప్పాలి. తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న తాజాగా అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియా సినిమా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి అందరి చేత అద్భుతహ అనిపించింది. అంతేకాదు ఈ సినిమా ద్వారా ఈమెకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ లభించడంతోపాటు శ్రీవల్లి పాత్రలో లీనమైపోయి నటించినందుకు రష్మిక మందన్న ను అందరూ ప్రస్తుతం శ్రీవల్లి అని పిలిచేస్తున్నారు.


ఇక శ్రీవల్లి గా రష్మిక చేసిన పాత్ర ప్రజలకు బాగా నచ్చింది అందుకే ఈమె ను అందరూ శ్రీవల్లి గా పిలవడం మొదలు పెట్టారు. ఇకపోతే వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక.. తాజాగా మరొక ఇంటి ఆవిడ కాబోతోందని వార్త బాగా వినిపిస్తోంది. నిజంగానే ఆమె ఒక ఇంటి ఆవిడ అయింది.. అది ఎలా అంటే ముంబైలో ఒక కొత్త ఇంటికి శ్రీకారం చుట్టింది రష్మిక మందన్న. అయితే ఈ ఇంటి విలువ సుమారుగా రెండు కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్న ఆమె ముంబైలో ఈ కొత్త ఇంటికి గృహప్రవేశం చేసినట్లుగా సమాచారం. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.అందరీ స్టార్ హీరోల సరసన నటించిన తర్వాత రష్మికా క్రేజ్ మరింత పెరిగి పోవడంతో పాటు రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు అనతికాలంలోనే ముంబైలో మరొక ఇంటిని కొనుగోలు చేయడంపై ఈమె ఏమాత్రం సంపాదిస్తోందో అంటూ అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది మరి ఇంకా బాగా రష్మిక కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: