పుష్ప సినిమా మొత్తం టాలీవుడ్ సినిమా పరిశ్రమకే గట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్లో మన టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రమే అక్కడ ప్రేక్షకులను మెప్పించాయి.  అవి ఎన్నో వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటిది ఇప్పుడు భారీ స్థాయిలో బాలీవుడ్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టాలీవుడ్ సినిమాలు అక్కడి ప్రేక్షకులను బాగా అలరిస్తుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడం అక్కడి వారిని బాగా మెప్పించడం వంటివి జరిగి మన టాలీవుడ్ ప్రతిష్టను మరొకసారి అక్కడ రెప రెప లాడించిన సినిమా అయ్యింది.

అలా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి కి భారీ ఇమేజ్ అలాగే భారీ డిమాండ్ భారీ అవకాశాలను తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా దర్శకుడు అయితే బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. హీరోయిన్ కూడా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల సరసన అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్ కూడా భారీగా తన పారితోషకాన్ని పెంచడం ఇప్పుడు టాలీవుడ్లో  సెన్సేషనల్ న్యూస్ గా మారింది. 

ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల కోసం భారీ స్థాయిలో రెమ్యునరషన్ డిమాండ్ చేస్తున్నాడట దేవి శ్రీ ప్రసాద్.  గతంలో అయన తీసుకునే దానికంటే రెట్టింపు రెమ్యునరేషన్ ఆయన అడుగుతున్నారట. క్రేజీ పెరిగినకొద్దీ పారితోషకాన్ని తీసుకునే విషయంలో మన సాంకేతిక నిపుణులు ఏమాత్రం ఆలస్యం చేయరు ఆ విధంగా దేవి శ్రీ ప్రసాద్ కూడా పుష్ప సినిమా తర్వాత భారీ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాడు. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి సైతం ఆయన వేరే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుండం ఉండడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొందర్లోనే మొదలు కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: