పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'  'హరిహర వీరమల్లు' సినిమాలను దాదాపుగా ఒకే సారి ప్రారంభించాడు, కాకపోతే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను ప్రారంభించి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకారంతో క్రిష్ జాగర్లమూడి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండపొలం అనే సినిమాను తెరకెక్కించాడు. కొండపొలం సినిమా కారణంగా హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు ,  'భీమ్లా నాయక్' సినిమాను కొన్ని రోజుల క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పించి ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. 


 అయితే గత కొంత కాలంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది అది అనేక వార్తలు వస్తున్నాయి,  అయితే ప్రస్తుతం దేశంలో కారోనా విజృంభించడంతో హరిహర వీరమల్లు సినిమా ఇప్పట్లో ప్రారంభం కావడం కష్టమేనని తెలుస్తోంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఏప్రిల్ వరకు ఈ సినిమా ప్రారంభం కావడం కష్టమే అనే వార్తలు వస్తున్నాయి, మరి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది చూడాలి. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది, అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు, కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: