దక్షిణ భారతదేశంలో అతి పెద్ద దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శంకర్ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోవడంతో సదరు సినిమాలు విడుదల కాకుండా పోయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు శంకర్ తో సినిమా చేస్తే చాలు లైఫ్ ఎక్కడికో పోతుంది అని ఆలోచించిన తమిళ హీరోలు ఇప్పుడు ఈ దర్శకుడు కనిపిస్తే వెళ్ళిపోతున్నారు. అలా శంకర్ ను తమిళంలో ఏ హీరో కూడా నమ్మకపోవడం తో ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు.

రామ్ చరణ్ తో కలిసి ఆయన ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తుండగా దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మొదట్లోనే ఈ సినిమాకు కండిషన్స్ పెట్టి ఈ సినిమాను మొదలు పెట్టారని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకూడదనే కండిషన్ శంకర్ కు పెట్టారట. ఆ విధంగానే ముందుకు వెళ్ళిన ఈ చిత్ర బృందం ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు బడ్జెట్ దాటిపోతుందని వార్తలు టాలీవుడ్ లో వినపడుతున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేసే విధంగా రామ్ చరణ్ ప్లాన్ చేశారు. 

అయితే ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోతుందని దాంతో చాలా ఇబ్బందులు వస్తాయని దిల్ రాజు రామ్ చరణ్ ఈ మధ్యనే చెప్పాడట. కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా కూడా ఇలాగే ఆర్థిక కష్టాలతో మధ్యలోనే ఆగిపోయింది. దానికి తోడు ఆ సినిమాకు కొన్ని ప్రమాదాలు జరగడం కూడా ఈచిత్రం ముందుకు వెళ్ళకపోవడానికి కారణం అయ్యింది. అలా శంకర్ ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమాను మొదలు పెట్టగా ఇప్పుడు ఈ చిత్రం కూడా ఆర్థిక కష్టాల లోకి వెళుతూ ఉండడం మెగా అభిమానులను ఏ మాత్రం మెప్పించడం లేదు అని చెప్పాలి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ దీని పై ఎవరైనా స్పందిస్తేనే మెగా అభిమానులు కుదుట పడేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: