టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు సినిమా అవకాశాల కోసం ఎంతో కష్టపడుతున్నారు అని చెప్పాలి. ఓ వైపు గ్లామర్ ను పంచుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న వీరు ఇంకొకవైపు తమ నటనతో వారిని ఎంతగానో అలరిస్తున్నారు. ఆ విధంగా  హీరోయిన్ లు తమకు ఉన్న అన్ని రకాల టాలెంటులతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమకు వచ్చి అగ్ర హీరోయిన్ గా ఎదిగిన మన హీరోయిన్ లలో ఎప్పుడూ పబ్లిసిటీ పిచ్చి బాగా పెరిగిపోతుంది అనేది గత కొన్ని రోజులుగా వారు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ ను బట్టి తెలుస్తుంది. 

ప్రేక్షకులలో ఎక్కువగా పేరు తెచ్చుకోవాలని చెప్పి వారు తెలుగు భాషను నేర్చుకోవడమే కాకుండా తెలుగులో స్పీచ్ లు ఇస్తూ ఒక్కసారిగా తెలుగు వారిని ఎంతో ఆకర్షిస్తున్నారు. అంతేకాదు తెలుగు అమ్మాయిల ఉండడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్లు ఎవరు అంటే పూజా హెగ్డే మరియు రష్మిక మందన చెప్పాలి. ఆ తర్వాత రేసులో ఉన్నారు నిధి అగర్వాల్, నాభ నటేశ్ వంటి యువ హీరోయిన్ లు. రాశి కన్నా సాయి పల్లవి అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ రేస్ లో లేకపోలేరు. వారు తమ నటనతో ఇప్పటికే సినిమాలతో పెద్ద హీరల సరసన నటించి వారిని వారు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 

ఏదేమైనా మన హీరోయిన్లు పబ్లిసిటీ చేసుకోవడం లో హీరోల ను మించి పోయారు అని చెప్పవచ్చు. ఆడియో ఫంక్షన్లలో ఇంటర్వ్యూలలో తమని తాము పొగడ్తలో ముంచెత్తి పోవడం ఎక్కువైపోయింది. దానికితోడు సాంకేతిక నిపుణులు దర్శక హీరోలు నిర్మాతలు కూడా హీరోయిన్లను ఆకాశానికి ఎత్తి వేయడంతో హీరోయిన్ ల పబ్లిసిటీ పిచ్చికి అంతులేకుండా పోయింది. అవసరం ఉన్న ప్రెస్ మీట్ కి రాని హీరోయిన్లు ఇటీవల కాలంలో అవసరం లేకపోయినా వచ్చి సమాధానాలు చెబుతుండడం పట్ల వారిలో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: