టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాపై ఫాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న తమన్.. పవన్ ఫాన్స్ కి వరుసగా అదిరిపోయే అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నాడు. తాజాగా మళ్లీ భీమ్లా నాయక్ సినిమా నుండి తదుపరి పాట గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చాడు.అయితే సింగర్ గీత మాధురి తో కలిసి గత రాత్రి తమన్ ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ నిర్వహించాడు. ఈ లైవ్ సెషన్లో భీమ్లా నాయక్ సినిమా నుండి రాబోయే నాలుగో పాట సంచలనాత్మకంగా ఉంటుందని వెల్లడించాడు. 

ఇది సింగిల్ మాస్ సాంగ్ కాదని.. లాలి తరహా పాట అని చెప్పుకొచ్చాడు తమన్. అయితే ఈ పాట విడుదల తేదీ కి సంబంధించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అంతేకాకుండా నిన్న కూడా తమన్ ఒక అప్డేట్ ఇస్తూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఇటీవల భీమ్లా నాయక్ సినిమా రఫ్ ఫుటేజ్ ని తాను చూశానని.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ తనకు ఎంతో బాగా నచ్చిందని.. పవన్కళ్యాణ్ కెరీర్లోనే ఇది ఉత్తమ చిత్రం అవుతుందని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే తమన్ అందించిన పాటలు భారీ రెస్పాన్స్ ని కనబరిచాయి.

మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది భీమ్లా నాయక్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ లు, పాటలు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి. మరోవైపు తాజాగా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ మూవీ అంటూ తమన్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవడమే కాకుండా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: