మహేష్‌ బాబు నిర్మాణ సంస్థ ప్రారంభించి చాలా కాలం అయ్యింది మరి.కాని ఇప్పటి వరకు ఆయన నిర్మాణం లో బయట హీరో లతో సినిమా లు అస్సలు రాలేదు. మొదటి సారి అడవి శేషు హీరోగా మేజర్ అనే సినిమా పట్టాలెక్కుతుంది.

పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా ను సోనీ పిక్చర్స్‌ వారు కూడా తెరకెక్కిస్తున్నారట.మహేష్ బాబు మరియు సోనీ పిక్చర్స్‌ కాంబోలో రూపొందుతున్న మేజర్ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యిందట.కాని ఇప్పటి వరకు విడుదల విషయంలో అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తూనే వచ్చారు.. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ మళ్లీ సినిమా విడుదల వాయిదా వేసేలా చేసిందట.

తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికం గా సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారట.. మహేష్ బాబు నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు పీక్స్ లో ఉన్నాయని కాని ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో అభిమానులు అంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారట.. సినిమా విడుదల తేదీ విషయం లో మళ్లీ గందరగోళం నెలకొనడం తో ఏం చేయాలో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారని సమాచారం.

ఒక వైపు సర్కారు వారి పాట సినిమాను వాయిదాల మీద వాయిదా లు వేస్తున్నారని సంక్రాంతి రావాల్సిన సర్కారు వారి పాట ను ఏప్రిల్‌ 1 కి వాయిదా వేశారని ఇప్పుడు ఏప్రిల్‌ 1 వ తేదీన కూడా సినిమా విడుదల చేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారట.దాంతో మహేష్‌ బాబు అభిమానులు అసహనంతో ఉన్నారని తెలుస్తుంది.ఇప్పుడు ఔను మేము కూడా వాయిదా వేస్తున్నాం అంటూ మేజర్‌ టీమ్‌ ప్రకటించడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యిందని సమాచారం.మరి చూడాలి మహేష్ సర్కారి వారి పాట ఎప్పుడు పాడతాడో..

మరింత సమాచారం తెలుసుకోండి: