విడాకుల ప్రకటన తర్వాత ధనుష్ తన సినిమాలతో బిజీ అయిపోయారు. మారన్ అనే సినిమాకోసం ఆయన వర్క్ స్టార్ట్ చేశారు. పొల్లాద ఉలగం అనే పేరుతో ఓ పాట కూడా పాడేశారు ధనుష్. ఇక ఐశ్వర్య కూడా తన పనిలో తాను బిజీ అయిపోతోంది. మ్యూజిక్ వీడియో ఆల్బమ్ పనుల్లో ఐశ్వర్య మునిగిపోయింది.
మొత్తమ్మీద ధనుష్, ఐశ్వర్య జోడీకి.. సమంత-నాగచైతన్య జోడీయే ఆదర్శమా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చైతన్య, సమంత కూడా విడాకుల ప్రకటన తర్వాత ఎక్కువ రోజులు ఖాళీగా కూర్చోలేదు. ఎవరి పనుల్లో వారి బిజీ అయిపోయారు. వారిలాగే ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య కూడా తమ సినిమాలు, ఆల్బమ్స్ తో బిజీ అయినట్టు తెలుస్తోంది.
మొత్తమ్మీద విడాకుల ప్రకటన తర్వాత ఐశ్వర్య, ధనుష్ జోడీ పెద్దగా రియాక్ట్ అవలేదు. విడాకుల ప్రకటనను సోషల్ మీడియాలో పెట్టి ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. దీంతో అసలీ సమస్యను కుటుంబ సభ్యులు పట్టించుకుంటారా లేదా అనేది కూడా డౌటే. ఈ విషయంలో మాత్రం వీరికి చైతన్య, సమంత జోడీయే ఆదర్శం అంటున్నారు. బాధతో కూర్చోకుండా ఎవరి వర్క్ లో వారు తమ టాలెంట్ చూపిస్తామంటున్నారు.