గోపీచంద్ మళ్లీ విలన్ గా మారిపోతున్నాడు. తన సినీ కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. అందులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆ తర్వాత విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ ట్రాక్ లోనే పయనించినా.. మళ్లీ విలన్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు గోపీచంద్. రాజమౌళి, మహేశ్‌ బాబు సినిమా లాంచింగ్ ఎప్పుడన్నది క్లారిటీ లేదు. అసలు జక్కన్న ఈ ప్రాజెక్ట్‌కి స్క్రిప్ట్‌ రెడీ చేశాడా లేదా అన్నది కూడా తెలియదు. కానీ ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీలో విలన్‌ గురించి ఆసక్తికరమైన కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఈ మూవీలో విలన్‌గా చేస్తున్నాడనే టాక్ వస్తోంది.

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఫిల్మ్‌నగర్‌లో బోల్డన్ని కథలు రెడీ అయ్యాయి. 'బాహుబలి, ఆర్ ఆర్ ఆర్'తో జక్కన్న వరుసగా పీరియాడికల్‌ డ్రామాలు తీశాడు కాబట్టి నెక్ట్స్‌ జానర్‌ మార్చుతాడని కొంతమంది, పాన్‌ ఇండియన్ అప్పీల్‌ ఉన్న యాక్షన్ మూవీ తీస్తాడని టాక్ నడుస్తోంది.

కృష్ణకి టాలీవుడ్‌లో యూనిక్‌ ఇమేజ్‌ ఉంది. ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్‌ జేమ్స్‌ బాండ్‌గా కృష్ణకి స్పెషల్‌ ఇమేజ్‌ ఉంది. మహేశ్‌ బాబు కూడా తండ్రిలాగే కౌబాయ్, జేమ్స్‌ బాండ్‌ లాంటి సినిమాలు చేస్తే బావుంటుందని సూపర్‌స్టార్ అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ అభిమానుల అంచనాలకు తగ్గట్లుగానే రాజమౌళి కూడా జేమ్స్‌బాండ్‌ తరహాలో స్పై థ్రిల్లర్‌ రెడీ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

రాజమౌళి, మహేశ్‌ బాబు మూవీ గురించి ఇప్పుడు మరో న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో గోపీచంద్‌ని విలన్‌గా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. 'బాహుబలి'లో రానా పోషించిన భళ్లాలదేవుడు క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, గోపీచంద్‌ క్యారెక్టర్‌ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్తున్నారు. మరి గోపీచంద్‌ నిజంగానే విలన్‌గా చేస్తున్నాడా.. అసలు ఈ ప్రాజెక్ట్‌కి సబ్జెక్ట్‌ లాక్‌ చేశారా అనేది తెలియాల్సిఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: