ఢీ షో వేడుక‌ల్లో చిందులు వేసిన సాయి ప‌ల్ల‌వి
త‌రువాత కాలంలో పెద్ద హీరోయిన్ అయిపోయారు
బిగ్ స్క్రీన్ మానియాలో త‌న‌ని తాను  చూసుకుని
మురిసిపోయి,అటుపై కోట్ల మంది అభిమానం
ద‌క్కించుకున్నారు.. ఇటు డిజిట‌ల్ మీడియాలోనూ
త‌న హ‌వాను కొన‌సాగిస్తున్న ఈ రౌడీ బేబీ
మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆశిద్దాం

అందాల తార సాయి ప‌ల్ల‌వి అరుదైన రికార్డు న‌మోదు చేశారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫైవ్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ను సంపాదించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచారు. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం విరాట ప‌ర్వం అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో  పాటు మ‌రికొన్ని సినిమాలు న‌టించేందుకు ఆస‌క్తి చూపుతోంది. ముందుగా ఆమెకు శుభాకాంక్ష‌లు చెబుతూ సాయి ప‌ల్ల‌వి గురించి ఇంకొంత...

మ‌ల‌యాళ కుట్టీ సాయి ప‌ల్ల‌వి ప్రేమమ్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. మ‌ల‌యాళంలో త‌న అదృష్టం ప‌రీక్షించుకోవ‌డ‌మే కాదు న‌టన ప‌రంగా కూడా తెలుగు సినిమా అభిమానుల‌ను సైతం ఆక‌ట్టుకున్నారు.ఆ సినిమా తెలుగులో రీమేక్ అయిన‌ప్ప‌టికీ మాతృకలో సాయి ప‌ల్ల‌వి క్రియేట్ చేసిన మ్యాజిక్ ను తెలుగులో చేయ‌లేక‌పోయారు.దాంతో ప్రేమమ్ సినిమా మ‌ల‌యాళం మాతృక‌ను దాటి ఇక్క‌డ పేరు తెచ్చుకోలేక‌పోయింది.ఇక్క‌డ హీరోయిన్ గా న‌టించిన అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఆమె ముందు తేలిపోయింది.ఇక తెలుగులో ఆమె న‌టించిన మొద‌టి సినిమా ఫిదా తో మంచి మార్కులు కొట్టేశారు సాయి ప‌ల్ల‌వి. ఆ సినిమాలో వ‌రుణ్ తేజ్ జోడిగా న‌టించి అంద‌రినీ ఫిదా చేశారు. అటుపై న‌ట‌న ప‌రంగా ఎంసీఏ కూడా ఆమెకు మంచి పేరే తెచ్చి పెట్టింది. ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు పాట ఉర్రూత‌లూగించింది. నానితో జోడీగా న‌టించిన ఎంసీఏ క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా మంచి టాక్ నే తెచ్చుకుంది.రొటీన్ రోల్ అయిన‌ప్ప‌టికీ సాయి ప‌ల్ల‌వి త‌న ఈజ్ తో భ‌లే ఆక‌ట్టుకున్నారు.


ఇక లేటెస్ట్ గా సాయిప‌ల్ల‌వి న‌టించిన ల‌వ్ స్టోరీ సినిమా తో మంచి మార్కులు కొట్టేసింది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మెగాస్టార్ చిరు నుంచి గొప్ప ప్ర‌శంస‌లు అందుకుంది.అంతేకాదు నాగ చైత‌న్య జోడీగా ఈ సినిమాలో ప‌రిణితితో కూడిన న‌ట‌న ను ప్ర‌ద‌ర్శించి అభిమానుల హృద‌యంలో మంచి స్థాన‌మే ద‌క్కించుకున్నారు. ముఖ్యంగా డ్యాన్స్ విష‌య‌మై చిరు ఆమెను ఎంతో ప్ర‌శంసించారు. త‌న‌కు సాయిప‌ల్ల‌వితో న‌టించాల‌ని ఉంద‌ని ఈ వేడుక‌ల్లోనే చెప్పి అంద‌రినీ ఫిదా చేశారు చిరు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కూడా ల‌వ్ స్టోరీ సినిమాలో సాయి ప‌ల్ల‌వి అభిన‌యంపై ప్ర‌శంస‌ల వాన కురిపించారు.త్వ‌ర‌లో ఆమె న‌టించిన విరాట ప‌ర్వం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. రానా హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాను వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఇక సాయి ప‌ల్ల‌వి తాజాగా న‌మోదు చేసిన రికార్డుకు సంబంధించి అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ ఇటు అభిమానుల్లో కూడా ఆనందోత్సాహాలు వెల్ల‌డ‌వుతున్నాయి. ఇన్ స్టాలో ఫైవ్ మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ తో మ‌రింత‌గా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్న సాయి ప‌ల్ల‌వికి ఆల్ ద బెస్ట్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: