రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు డార్లింగ్. ఈ సినిమా తరువాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ.. తన తోటి స్టార్ హీరోలందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 నుంచి 6 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

 ఇంకా దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, బాలీవుడ్ డైరెక్టర్  తో ఆది పురుష్ సినిమా అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలుచేస్తుండగా.. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తో 'స్పిరిట్' అనే సినిమాను కూడా ప్రకటించాడు. ఈ సినిమాలో సలార్, ఆది పురుష్ సినిమాలు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి . ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కూడా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూడు సినిమాలను కూడా ప్రభాస్ సమాంతరంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.

 ఇక మరోవైపు సందీప్ వంగా స్పిరిట్ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇన్ని సినిమాలు లైన్లో ఉన్న ఇంకా ప్రభాస్ మాత్రం కొత్త స్క్రిప్ట్ లను వింటూనే ఉన్నాడట. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఒక బడా నిర్మాత దగ్గర 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను అడ్వాన్స్ గా అందుకున్నాడని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఆ నిర్మాత మరెవరో కాదు డి.వి.వి.దానయ్య తెలుస్తోంది. దానయ్య ప్రభాస్ కి ఓ సినిమా కోసం 50 కోట్లు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాడట. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్తను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: