యావత్ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్' టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ ప్రభావం వల్ల మళ్ళీ వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి హీరోలు ఎన్టీఆర్, చరణ్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అందులో ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం త్రిబుల్ ఆర్ మూవీ హెవీ యాక్షన్ ఫైట్స్ తో క్లైమాక్స్ ఉంటుందట.

 కేవలం క్లైమాక్స్ సుమారు నలభై నిమిషాలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో క్లైమాక్స్ కోసమే దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేశారని వినికిడి. ముఖ్యంగా ఈ సినిమాలోని అన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను థియేటర్స్ లో ఒక అద్భుతమైన థ్రిల్ కలిగిస్తాయని నమ్మకంగా ఉంది చిత్ర యూనిట్.కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే వంద కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. దీంతో సినిమాపై మరో సారి అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను రాజమౌళి చూపించారు. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ మధ్య వచ్చే యాక్షన్ పార్ట్ అయితే ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.

 దీనికి తోడు ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ సుమారు 40 నిమిషాలు ఉంటుందని వార్తలు వినిపిస్తుండటంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి 18న లేక ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల ఈ చిత్రానికి అధికారికంగా ప్రకటించింది. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, ఆలియాభట్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వాటితోపాటు సముద్రకని, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR