ఒక హీరో ఒకే రోజు రెండు సినిమాలను విడుదల చేయడం మనం చూసాం. ఆఖరికి ఒక దర్శకుడు కూడా ఒకే రోజున రెండు సినిమాలను విడుదల చేశాడు. కానీ నిర్మాత తాను నిర్మించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం అనేది ఇప్పటి వరకు కూడా జరగలేదని చెప్పాలి. ఇలా ఎందుకు జరగదు అంటే ఓ నిర్మాత నిర్మించిన సినిమాకు ఎంత వీలైతే అంతగా కలెక్షన్లను సంపాదించుకోవాలని చూస్తాడు కానీ ఒకరోజు ఒక సినిమాకు వచ్చే కలెక్షన్ రెండో సినిమాకి కూడా పంచాలని అనుకోడు. కానీ ఇప్పుడు దిల్ రాజు ఇదే సాహసము చేయబోతున్నాడు. ఆయన నిర్మిస్తున్న రెండు సినిమాలను ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న దిల్ రాజు సాహసాలకు పెట్టింది పేరు. ఆయన పంపిణీదారుడు గా ఉన్న సమయంలోనే ఎంతో రిస్క్ చేసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించగా అది కాస్తా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన రిస్క్ ఫలించిందని చెప్పాలి. అలా ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదిగాడు అని చెప్పాలి. అంతేకాదు నిర్మాత అయిన తర్వాత కూడా ఎన్నో రిస్క్ లు చేసి ఇండస్ట్రీకి కొత్త రకమైన ట్రెండ్ లను తీసుకువచ్చాడు . హీరోలను సృష్టించాడు.. దర్శకులను కూడా సృష్టించాడు. ఆ విధంగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు భారీస్థాయిలో సేవ చేసాడు దిల్ రాజు అని చెప్పాలి.

ప్రస్తుతం ఆయన ఫోకస్ పాన్ ఇండియా సినిమాలు మీద ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ శంకర్ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దిల్ రాజు అదే సమయంలో వంశీ పైడిపల్లి మరియు విజయ్ దళపతి కాంబినేషన్ లోనూ సినిమా ను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఆయన భావిస్తూ ఉండడం ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు. మర ఇంతధైర్యంగా ఆయన తన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనేది చూడాలి. వస్తే మాత్రం అది సెన్సేషన్ సృష్టించే న్యూస్ అవుద్ది. 

మరింత సమాచారం తెలుసుకోండి: