మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, అలాగే మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు, అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో కూడా చిరంజీవి హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి, వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి, దర్శకుడు మారుతి కి కూడా ఒక సినిమా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం అనేక వార్తలు వచ్చాయి, అయితే తాజాగా మారుతి, చిరంజీవి తో కాకుండా ప్రభాస్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అయితే చిరంజీవి తో తెరకెకించాలనుకున్న సినిమా కథను మారుతి,  ప్రభాస్ తో తెరకెక్కించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు,  ప్రస్తుతం దర్శకుడు మారుతి, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: