నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదలైన అఖండ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి బాలకృష్ణ కు బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టింది. ఇది ఇలా ఉంటే అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కన్నడ హీరో దునియా విజయ్ నటించినుండగా మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఒక పాత్రలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనుండగా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఈ నెల 11 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావలసి ఉంది, కానీ కారోనా సమస్య వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇది ఇలా ఉంటే వచ్చే నెల 12 వ తేదీ నుండి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది, రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ కి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారట. ఆ తర్వాత ఈ సినిమా మిగతా షూటింగ్ ని  కడప ప్రాంతంలో చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: