సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహేష్ 25 వ సినిమా నుంచి  నటిస్తున్న వరుస సినిమాలు హిట్ సినిమాలు అవ్వడం విశేషం. ఇటీవల మహేష్ నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూన్నారు.. ఆ సినిమానె సర్కారు వారి పాట.. సినిమాలో నటిస్తూన్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి అందరికి తెలుస్తుంది..


బ్యాంకింగ్ స్కామ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత హైప్ ను పెంచుతున్నాయి. మొత్తాని కి సినిమా పై అంచనాల ను పెంచేసింది.. దీంతో సినిమా హిట్ అవుతుందని చిత్రయూనిట్ అభిప్రాయ పడుతున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‏ లో ఓ మూవీ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో గతం లో అతడు, ఖలేజా వంటి చిత్రాలు వచ్చాయి. ఆ సినిమాలు బాక్సాఫిస్ దగ్గర ఘన విజయాన్ని అందుకున్నారు.

 

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్ధరి కాంబో లో మరో సినిమా రాబోతుండడం తో మహేష్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి సారి ఏదొక అప్డేట్ వస్తుంది. దాంతో మహేష్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.మహేష్ చెల్లెలి పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లుగా టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమా లో నటించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర సినిమాకు హైలెట్ అవ్వనుంది.. మరి ఆ పాత్ర గురించి తెలియలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందె..


మరింత సమాచారం తెలుసుకోండి: