తెలుగులో ఇప్పటి వరకూ పాన్ ఇండియా మూవీ అంటే అది బాహుబలి మాత్రమే అనుకునేవారు. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా ఆ స్థాయిని అందుకోలేదు. కానీ ఇప్పుడు పుష్ప ఆ రికార్డులన్నిటినీ తిరగరాసేస్తోంది. కలెక్షన్ల లెక్కల్లో బాహుబలి అందనంత ఎత్తులో ఉన్నా కూడా క్రేజ్ లో మాత్రం పుష్ప అదరగొడుతోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో పాటలు, మేనరిజమ్స్ అన్నీ హైలెట్ గా మారాయి.

పుష్ప సినిమాలో పాటలకు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాల్లో ఊ అంటావా.. ఊఊ అంటావా ఇప్పుడు ఊపేస్తోంది. అంతెందుకు మన దేశంలో ప్రధాని నరేంద్రమోదీపై కూడా పుష్ప మీమ్స్ అదిరిపోతున్నాయి. ఇక ఇటీవల మాస్క్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజంని వాడుకున్నారు.

మొత్తమ్మీద బాహుబలి విషయంలో అప్పట్లో ప్రభాస్ ని ఈ రోంజ్ లో ఎవరూ అనుకరించలేదు, కానీ ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ మేనరిజమ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అదిరిపోయే లెవల్లో ఉంటున్నాయి. ఒకరకంగా పాపులార్టీలో బాహుబలిని పుష్ప ఆల్రడీ బీట్ చేసిందని అంటున్నారు.

మేనరిజమ్స్ హైలెట్..
పుష్ప సినిమాలో పాటలు, మాటలు జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. పాటల పేరడీలు బాగా ఫేమస్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ మేనరిజమ్స్.. సినిమా రిలీజైన తర్వాత మెల్ల మెల్లగా బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ మేనరిజమ్స్ ని చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అనుకరిస్తున్నారు. ఇప్పుడీ అనుకరణతోనే పుష్ప గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి రీచ్ కంటే పుష్ప ఇంకా ఎక్కువగా దూసుకుపోయింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి పోటీ పెట్టి మరీ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇకపై పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అంటున్నారు.
 పుష్ప సినిమాకి మొదట్లో మిక్స్ డ్ టాక్ వచ్చినా, ఇప్పుడిప్పుడే పుష్ప క్రేజ్ పెరుగుతోంది. దీంతో సెకండ్ పార్ట్ పై మరింత శ్రద్ధ పెట్టబోతున్నారు డైరెక్టర్ సుకుమార్.  

మరింత సమాచారం తెలుసుకోండి: