టాలీవుడ్ నటుడు రాజశేఖర్ సినిమా కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి, అలా రాజశేఖర్ కెరియర్ లో ఉన్న మంచి సినిమాలలో ఎవడైతే నాకేంటి సినిమా ఒకటి, సింహరాశి సినిమా తర్వాత రాజశేఖర్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు దక్కలేదు, ఆ తర్వాత రాజశేఖర్ కు ఎవడైతే నాకేంటి సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సముద్ర తెలియజేశాడు, ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సముద్ర గారికి మీకు సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనైనా బేధాభిప్రాయాలు వచ్చాయా అని ప్రశ్న ఎదురైంది, దానికి సమాధానమిస్తూ సముద్ర గారు... సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక రాజశేఖర్ తో తప్ప ఎవరితో బేదాభిప్రాయాలు ఏర్పడలేదు,  సింహరాశి మూవీ తర్వాత  రాజశేఖర్ కు వరుస ప్లాప్ లు వచ్చాయి, ఆ తర్వాత కొన్ని సార్లు రాజశేఖర్ కొన్ని మూవీస్ చేయమని నన్ను అడిగాడు, కానీ ఆ సబ్జెక్ట్  లు నచ్చక నేను చేయలేదు. కానీ రాజశేఖర్ నాతో మూవీ చేయడం ఇష్టం లేకే ఇలా అంటున్నాడు అని అనుకున్నాడు, ఆ తర్వాత ఎవడైతే నాకేంటి మూవీ సబ్జెక్ట్ నచ్చి నేనే చేస్తాను అని చెప్పాను.

మూవీ స్టార్ట్ అయ్యింది, సినిమా దాదాపుగా పూర్తవడానికి వచ్చింది, ఎవడైతే నాకేంటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము అనే నమ్మకం మాకు ఏర్పడింది. అయితే ఆ తర్వాత నుండి వారు నన్ను ఎవడైతే నాకేంటి మూవీ నుండి తప్పించి దర్శకుడిగా వారి పేరును వేసుకుందాము అని అనుకున్నారు,  నేను కూడా ఈ మూవీ నుండి బయటకు వెళ్లిపోయాను, అప్పటికే ఎవడైతే నాకేంటి సినిమా షూటింగ్ దాదాపుగా 80 శాతం వరకు పూర్తి అయ్యింది. ఆ తర్వాత మళ్లీ రాజశేఖర్, జీవిత పిలిచి నాతో మూవీ ని చేయించారు, మూవీ మొత్తం పూర్తి అయ్యాక మళ్లీ దర్శకుడిగా వాళ్ల పేరే వేయించుకున్నారు అని దర్శకుడు సముద్ర  తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: