ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా ఇండియా సినిమాలు చేయాలని గట్టిగా దృఢంగా నిశ్చయించుకున్నట్లు ఉంది. పెద్ద హీరోలు అందరూ ఇప్పుడూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా మార్కెట్ లో పాతుకు పోగా ఆయన భారీ స్థాయిలో పారితోషకం అందుకుంటూ తన కెరీర్ ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక్క సినిమాకి 100 కోట్ల పైగా పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అలాగే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు ప్రభాస్ సరసన చేరాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంతో గ్రాండ్ గా అడుగుపెట్టిన అల్లు అర్జున్ భారీ స్థాయిలో ఆ సినిమాతో సక్సెస్ సాధించి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దాంతో ఆయన తన తదుపరి సినిమా నుంచి 100 కోట్లు అందుకుంటూ ఇప్పుడు 100 కోట్ల హీరోగా ఎదిగాడు. ఆ విధంగా పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అయితే మన హీరోలు 100 కోట్లు తీసుకునే హీరోగా ఎదగడం ఇప్పుడు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరికొంత మంది హీరోలు ఈ ఇండియా సినిమాల్లో సక్సెస్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో తొందర్లోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దం కాబోతున్నారు. ఆ విధంగా వీరు ఆయన సినిమాల్లో సక్సెస్ సాధిస్తే తప్పకుండా ప్రభాస్ అల్లు అర్జున్ లా వంద కోట్ల హీరోగా మారడం ఖాయం అని తెలుస్తుంది. మరి ఈ విధమైన ట్రెండ్ భవిష్యత్తులో ఏ విధమైన పరిస్థితులకు వెళుతుందో కానీ ఇప్పుడు మాత్రం దేశం మొత్తం ఆకట్టుకునే అభిమానం పొందే సినిమాలు పాన్ ఇండియా సినిమాలు మన టాలీవుడ్ హీరోలు చేస్తూ ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: