టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇప్పుడు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు నిర్మాణం చేపట్టాడు. అందులో ఒకటి విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగు దర్శకుడు తెలుగు నిర్మాత భారీ బడ్జెట్ తో భారీ పారితోషికాన్ని ఇచ్చి ఓ తమిళ హీరో తో సినిమాను చేయడం నిజంగా తెలుగు వారిని ఎంతో ఆశ్చర్యపరిచిన విషయం అని చెప్పాలి. దాంతోనే వీరిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు ఇంతటి స్థాయి ఉన్న సినిమాను  తెలుగు హీరో తో చేయకపోవడం తో వారీ ఆగ్రహానికి గురయ్యారు వీరు. 

ఇకపోతే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కూడా దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న డు. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ తొందరలో ముగించి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మొదటగా చిత్ర యూనిట్ భావించింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఫోకస్ ఈ సినిమాపై కాకుండా విజయ్ దళపతి నటించబోయే సినిమాపై ఎక్కువగా పెట్టడంతో ఇప్పుడు తెలుగు సినిమా అభిమానుల ఆగ్రహానికి మరొకసారి గురవుతున్నారు దిల్ రాజు.

మొన్నటి దాకా ఈ రెండు చిత్రాలను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్న దిల్ రాజు ఇప్పుడు మారుతున్న పరిస్థితుల రీత్యా విజయ్ దళపతి సినిమా మాత్రమే సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్ సినిమా  ను ముందుగానీ తర్వాతగానీ విడుదల చేయాలని ఆలోచనలు చేస్తున్నాడట. దాంతో పండుగ సందర్భంగా తమ హీరో సినిమా విడుదల చేయకపోవడానికి కారణం ఏంటి అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు మెగా అభిమానులు. తెలుగు పండుగకు తెలుగు హీరో సినిమా కాకుండా వేరే భాష హీరో సినిమా విడుదల అవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు.  మరి దిల్ రాజు ఈ నిర్ణయం పై మరొక ఆలోచన చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: