నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో హిట్టు సూపర్ సినిమాలలో నటించాడు.  ఇది మాత్రమే కాకుండా బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్ లో కూడా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు, ఇదిలా ఉంటే తాజాగా కూడా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించాడు.
 ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా వంద కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా సాధించి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది, ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది, శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇది మాత్రమే కాకుండా బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు.



 ఇది ఇలా ఉంటే బాలకృష్ణ మొట్టమొదటిసారి డ్యూయల్ రోల్ లో కనిపించిన సినిమా అపూర్వ సహోదరులు, ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా సత్యానంద్ డైలాగ్ లను వ్రాశాడు, ఈ సినిమాకు కే కృష్ణమోహనరావు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా భానుప్రియ, విజయశాంతి కీలక పాత్రలో నటించారు, ఈ సినిమాలో మొదటిసారి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు, ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 9 అక్టోబర్ 1986 న ఈ సినిమా విడుదల అయ్యింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాలకృష్ణ మొట్టమొదటిసారి డ్యూయల్ రోల్ లో నటించిన అపూర్వ సహోదరులు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: