యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తన మార్కెట్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు, అయితే బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేసే ఉద్దేశంతో ప్రభాస్ కూడా వరుస పాన్ ఇండియా , అంతకు మించిన సినిమాలో నటిస్తున్నాడు,  అందులో భాగంగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా ప్రాజెక్టు కే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా అమితాబచ్చన్ దీపికా పదుకొనె ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ మరొకసారి ప్రభాస్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాకు కరణ్ జొహార్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు ఇవ్వలేదు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాలతో పాటు సలార్, ఆది పురుష్  సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా స్పీరిట్ అనే మూవీ లో నటించడానికి కూడా ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు మాత్రమే కాకుండా  ప్రభాస్ ఇప్పటికే రాదే శ్యామ్ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు, ఈ సినిమాకు జిల్ ఫెమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు, కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను జనవరి 14 వ తేదిన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది, కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో ఈ సినిమాను విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది,  ఇదిలా ఉంటే ఈ సినిమా కొత్త  విడుదల తేదీని ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: