ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న రష్మిక మందన్నా.. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత తన ఊపును పెంచింది. వరుస అవకాశాలు రావడంతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్‌లో సినిమాలు చేయడంలో అక్కడే ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే రష్మిక ఇటీవల చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నెటిజన్స్ ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలకు, డిన్నర్‌లకు వెళ్తుంటారు. అయితే తాజాగా రష్మిక మందన్నా కూడా ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కి డిన్నర్‌కి వెళ్లింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.


టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌లోనూ రాణించాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు సినిమాలకు ఓకే కూడా చెప్పింది. హీరో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన పుష్ప సినిమా హిట్ కావడం.. ఆమెకు బాగా కలిసోచ్చింది. ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే హోటల్‌కి తన ఫ్రెండ్స్ తో తినడానికి వెళ్లిన రష్మికకు.. అక్కడి ఫోటోగ్రాఫర్లు, మీడియా ఛానెళ్లు ఫోజులు ఇవ్వమని అడిగారు. దీనికి రష్మిక కూడా ఓకే చెబుతూ ఫోజులిస్తుంది. ఆ టైంలోనే ఒక చిన్న పిల్లాడు తన దగ్గరికి వచ్చి.. ‘ఆకలేస్తుంది.. డబ్బులివ్వండి’ అని కోరుతాడు. కానీ రష్మిక ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోదు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది.


రష్మిక చేసిన పనికి నెటిజన్లు మండి పడుతున్నారు. కనికరం లేకుండా ఫోటోలకు ఫోజులిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పిల్లాడు.. ఆకలేస్తుంది.. డబ్బులు ఇవ్వమని కోరినా.. ఆ పిల్లాడి మాటలు పట్టించుకోనట్లు ప్రవర్తించిందని విమర్శించారు. అయితే రష్మిక చేసిన పనికి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలకు డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తే.. వారు అలాగే డబ్బులు అడుగుతూ ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఏదీ ఏమైనా.. ఈ ఘటనతో రష్మికపై నెటిజన్లు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: