ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చాలా బిజిగా ఉంది.. వరుస సినిమాలను తెరకెక్కించె హీరో, హీరోయిన్లు ఉన్నారు. డైరెక్టర్ లు కూడా అదే పనిలో ఉన్నారు. థియెటర్స్ లేకున్నా కూడా ఓటీటీలో అయిన సినిమాలను విడుదల చెయాలనె ఆలోచనలో వున్నారు. ఒకవైపు కరోనా మహమ్మరి విజ్రుంభిస్తున్న కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు వీలైనంత వరకూ ఎక్కువ సినిమాలను చెయాలనె ఆలోచన లో వున్నట్లు తెలుస్తుంది..


విషయానికొస్తె.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా రావాల్సి వుంది. కానీ, ఆయన కు కరోనా సొకిందని తెలియడం తో ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు.తన తండ్రి చిరంజీవికి మెసెంజర్‌గా ఈ ఫంక్షన్‌కు వచ్చినట్లు చరణ్ తెలిపారు. గుడ్ లక్ సఖిని అందరూ చిన్న సినిమా అంటున్నారని, కానీ జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్, జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు నగేష్ కుకునూర్‌లు తీసిన ఈ సినిమాను ఎప్పటికీ చిన్న సినిమా అని అనను.


ఇది ఒక పెద్ద సినిమా అనే చెప్పాలి అని చెర్రి అన్నాడు.అజ్ఞాత వాసి, మహానటి సినిమాల్లో కీర్తి సురేష్ నటన తనకు చాలా ఇష్టమని చరణ్ అన్నారు. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చారు.. మొత్తానికి కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు... ఇది ఇలా ఉండగా..కీర్తి సురేష్‌తో నాటు నాటు స్టెప్ వేసి ప్రేక్షకులను అలరించారు.. కీర్తి సురేష్ కోరిక మేరకు చెర్రి ఆమెతో కలిసి స్టెప్పులు వేశారు.. ఇది ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది. మీరు ఒకసారి చూడండి...

మరింత సమాచారం తెలుసుకోండి: