పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని , ప్రస్తుతం బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతోంది. తెలుగులోకి నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా అడుగు పెట్టి అమాంతం తన క్రేజ్ ను పెంచేసుకుంది ఈ బుట్ట బొమ్మ. ఇక తర్వాత అల్లు అర్జున్ , మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించిన.. ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోలను సైతం మెప్పిస్తోంది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమా అయిన రాధే శ్యామ్ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషిస్తూ ప్రేక్షకులకు కన్నుల పండుగ చేస్తోంది.

రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాలో ప్రభాస్ - పూజా హెగ్డే ల మధ్య సన్నివేశాలు చిత్రీకరించి మునుపెన్నడూ లేని విధంగా రొమాన్స్ చిత్రాలు తెరకెక్కించడం జరిగింది. కాకపోతే సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా.. మరొకవైపు టికెట్ రేట్స్ తగ్గడంతో వాయిదా వేసుకున్నారు.. అంతేకాదు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రం మేకర్స్  హామీ ఇవ్వడం జరిగింది.

పూజా హెగ్డే ఈ సినిమా  షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఆమె కొత్తగా గృహప్రవేశాన్ని కూడా పూర్తి చేసింది.. సుమారుగా ఒక కోటి రూపాయల విలువ చేసే ఇంటిని సొంతం చేసుకున్న  పూజా .. పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. ఇక తాజాగా ప్రస్తుతం మరొక ప్రాజెక్టు లో నటించడానికి సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ ..అందులో భాగంగానే రాజస్థాన్ లో  షూటింగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడే షూటింగ్ లో పాల్గొన్న  పూజా హెగ్డే.. త్వరలోనే ఇంకొక సినిమాలో కూడా చేయబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా మూవీ గా రాధే శ్యామ్ సినిమాతో సక్సెస్ పొందితే ఈమె రేంజ్ మరింత పెరిగిపోయే అవకాశం అయితే ఉంది అంతేకాదు ప్రస్తుతం ఈమె ఒక్కొక్క  సినిమాకు  రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ

మరింత సమాచారం తెలుసుకోండి: