జీన్స్, ప్రేమికుడు లాంటి సినిమాలు ఆయన స్థాయిని ఆ రోజే నిరూపించాయి.ఆయన కొత్తదనానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, సంగీతానికి ఎంతటి విలువ ఇస్తారో అన్నది నిరూపణ అయింది. తాజాగా రామ్ చరణ్ తేజ్,కియారా అడ్వానీ కాంబినేషన్ లో ఆయన ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే! ఈ సినిమాను క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
చెర్రీ హీరోగా నటిస్తున్న 15 వ చిత్రమిది కావడం, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండడంతో దిల్ రాజు బడ్జెట్ కు ఎక్కడా లోటు పెట్టకపోయినా ఓ అడ్డేట్ మాత్రం చాలా ఆసక్తిగానే ఉంది. అదేంటంటే త్వరలో రామ్ చరణ్ , కియారా అడ్వానీపై చిత్రీకరించే పాటకు 25 కోట్లు వెచ్చించనున్నారని సమాచారం. జపాన్ లో షూట్ చేయనున్న ఈ పాటకు సంబంధించిన ఈ అప్డేట్ ఇండస్ట్రీలో ఎందరినో ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో శంకర్ సినిమాలన్నింటినీ దాదాపు ఏఎం రత్నమే నిర్మించారు.రోబో మాత్రం సన్ పిక్చర్స్ పతాకంపై కరుణానిధి మనవలు దయానిధి మారన్,తదితరులు నిర్మించారు. ఆ సినిమా కూడా భారీ చిత్రమే
అయినప్పటికీ ఇంతగాఖర్చు చేయలేదు.
ఆ సినిమా వరకూ ఐశ్వర్య రెమ్యునరేషనే హైలెట్. కానీ ఇక్కడ అలా కాదు చాలాడబ్బు వెచ్చించి షూట్ పార్ట్ తీస్తున్నారు. సినిమాకు ఇంతటిభారీ బడ్జెట్ ఎందుకు అవసరం అవుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మిగతా సాంకేతిక బృందమంతా జాతీయ స్థాయిలో పేరున్న వారే కావడం విశేషం. ఇవన్నీ కలగలిపి చిత్ర నిర్మాణ స్థాయిని పెంచుతున్నాయన్నది టాలీవుడ్ మాట. ఒకవేళ సినిమా ఎత్తిపోతే..అప్పుడు ఏం కావాలి నిర్మాత? గతంలో రోబో 2 విషయమై ఇలానే జరిగింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేక నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ను నిలువునా ముంచింది. ఇప్పుడు కూడా అదే భయం దిల్ రాజు వర్గాల్లో ఉన్నా డైరెక్టర్ శంకర్ కు ఎదురు చెప్పలేకపోతున్నారు అని సమాచారం.